1. రాష్ట్రం లో తొలిసారి
- ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తొలిసారిగా వివి ఫ్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టనుంది .
- వీటి ద్వారా తాము ఓటు వేసిన అభ్యర్థికే ఆ ఓటు పడిందా లేదా అని ఓటర్లు నిర్దారించుకోవచ్చు
- ఏప్రిల్ 11 న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీటిని వినియోగించనున్నారు .
- ఈ వివి పాట్ యంత్రాలలో 7 సెకన్ల పాటు అభ్యర్థి పేరు పార్టీ గుర్తున్న స్లిప్పు కనిపిస్తుంది .
2. ప్రపంచం లోనే తొలి 5జి కలిగిన ప్రాంతంగా షాంగై .
- 5జి కవరేజ్ , బ్రాడ్ బ్యాండ్ గిగాబైట్ నెట్ వర్కులను రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి ప్రాంతంగా షాంగై అవతరించింది .
- 5జి అన్నది 4జి ఎల్ టి ఈ నెట్ వర్క్ ల కన్నా 10 నుంచి 100 రెట్లు అధిక డౌన్లోడ్ వేగం కలిగి ఉంటుంది .
3. పీఎస్ఎల్ వి రిహార్సల్ పూర్తి
- భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో శనివారం నిర్వహించిన పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి-45 రిహార్సల్ విజయవంతమైంది.
- పీఎస్ఎల్ వి సి-45 ప్రయోగం సోమవారం ఉదయం 9.27 గంటలకు జరిగేలా అధికారికంగా ప్రకటించారు .
- ఈ వాహన నౌక డిఆర్ డిఓ కు చెందిన ఇమిసాట్ తో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు కక్ష్యల్లో వాటిని ప్రవేశపెట్టనుంది .
4. ఈ - లెర్నింగ్ శిక్షణలో తెలంగాణా కు మొదటి స్థానం .
- ప్రభుత్వ ఉద్యోగులకు ఈ - లెర్నింగ్ శిక్షణలో వరుసగా రెండో సంవత్సరం తెలంగాణా కు మొదటి స్థానం దక్కింది .
No comments:
Post a Comment