ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ధ్రువ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపం లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం , ధ్రువ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ను , మొబైల్ అప్ ను రూపొందించబోతోంది . 2019 వ సంవత్సరం లో నే పైలట్ ప్రాజెక్ట్ కింద పదవ తరగతి , ఇంటర్ బోర్డులు , జేఎన్టీయూ , కృష్ణ యూనివర్సిటీ లు జారీ చేసే సర్టిఫికెట్ లను , ఇవి కాక రవాణా శాఖ జారీ చేసే లైసెన్స్ , ఆర్సీ బుక్ లను ఎలక్ట్రానిక్ రూపం లో ధ్రువ పోర్టల్ ను అతి త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు .
ఈ పోర్టల్ లో ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ లాకర్ ఉంటుంది . ఇందులో ధ్రువ పత్రాలను ఉంచుతారు . మనకు కావలసినప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
ప్రతి సర్టిఫికెట్ పైన ధ్రువ ముద్ర ఉంటుంది . ఆ సర్టిఫికెట్లు అసలైనవేనని ఆ ముద్ర ధృవీకరిస్తుంది .
కేంద్ర ప్రభుత్వం ' డిజిలాకర్ ' తో పోలిస్తే ధ్రువ పూర్తిగా బిన్నంగా ఉంటుంది . డిజిలాకర్ లో పౌరులు నేరుగా తమ సర్టిఫికెట్లను భద్రపర్చుకోవచ్చు . కానీ అవి అసలైనవేనని ధృవీకరించిన తర్వాతే ధ్రువ ముద్ర పడుతుంది .
No comments:
Post a Comment